హసన్‌పర్తిలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

తెలంగాణ అక్షరం- హసన్ పర్తి

స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించారు. తాము కూడా భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చాడ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణతో చక్కగా చదువుకోని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని అలాగే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, దేవమ్మ, పున్నంచందర్, శ్రీకాంత్, రేవతి, కిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

రైతుల సంక్షేమానికి కృషి

సింగల్ విండో అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక రైతుల సంక్షేమానికి సహకార సంఘం కృషి చేస్తోందని, యాసంగి పంట తరుగు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *