- BMS కార్యకర్తలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్ పిలుపు
తెలంగాణఅక్షరం-కరీంనగర్
ప్రజాస్వామ్యంలో కార్మికుల యొక్క హక్కులను కాల రాస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కి నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు BMS రాష్ర్ట ఉపాధ్యక్షుడు పప్పుల సురేష్ తెలిపారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసన తెలపడంతో కలెక్టర్ ద్వారా సీఎంకు మెమోరాండం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని , కావున జిల్లా నాయకులు కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పప్పుల సురేష్ పిలుపునిచ్చారు.
Please follow and like us: