తెలంగాణ అక్షరం-బాలాపూర్ :
తెలంగాణ మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర విభాగం లో బాలాపూరకు చెందిన పిల్లి గోవర్ధన్ కు చోటు దక్కింది. బాలాపూర్ కు చెందిన గోవర్ధన్ మండల ప్రచార కార్యదర్శి గా, నగరం ( నిజామాబాద్ జిల్లా) అధ్యక్షలుగా కొనసాగుతున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగాల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 6న వరంగల్ లో రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, మహేంద్ర బంధువులు అందరూ హాజరుకావాలని కోరారు.
Please follow and like us: