కొంపల్లిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :

స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని బుధవారం బిజెపి ఆధ్వర్యంలో కొంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయతను చాటేందుకు ముందుకు రావాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని పట్టుకుని విద్యార్థులు, ప్రజలు భారత్ మాతాకీ జై అంటూ దేశభక్తి ఉప్పొంగేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్, మేడ్చల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు విక్రం రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ జేకే శేఖర్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, కార్పొరేటర్ శేషగిరి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, కొంపల్లి మండల అధ్యక్షులు సతీష్ సాగర్, జాయింట్ కన్వీనర్ శివాజీ, సరిత, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *