బిగ్ బ్రేకింగ్ :   గ్రూప్ -1 పరీక్షలు రద్దు

 

 

తెలంగాణ అక్షరం-హైదరాబాద్ :

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు అయ్యాయి. జూన్ 11న జరిగిన గ్రూప్ -1 పరీక్షలను హై కోర్టు రద్దు చేసింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టును గ్రూప్-1 అభ్యర్థులు ఆశ్రయించారు. ఇక, గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన హైకోర్టు పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ -1 పరీక్ష రద్దు కాగా తాజాగా హైకోర్టు ఆదేశాలతో రెండోసారి రద్దయింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను 2,33,248 మంది రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. లీకేజీ వ్యవహారం కారణంగా పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ పరీక్షను నిర్వహించారు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *