సతీష్ కు ప్రణవ్ అభినందన

తెలంగాణఅక్షరం-వీణవంక

ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలల్లో మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పోతరవేన సతీష్ కుమార్ మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా సతీష్ ను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదివారం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మండలంలోని యువతను పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు యువతను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే మండలంలోని లస్మక్కపల్లి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించేలా కృషి చేయాలని ప్రణవ్ ను ఆ గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్,ఉపాధ్యక్షులు ధర్మముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *