తపస్ మండల అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి
క్యాలెండర్ ఆవిష్కరించిన ఉపాధ్యాయులు
తెలంగాణ అక్షరం-హసన్ పర్తి
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( తపస్ ) హసన్ పర్తి మండల శాఖ అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి డిమాండ్ చేశారు. తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 DA లను వెంటనే విడుదల చేయాలని, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వాలని, పే రివిజన్ కమిషన్ నివేదికను వెంటనేఅమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ బత్తిని వీరస్వామి గౌడ్, సిద్ధాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు డి రవి కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు