కరీంనగర్లో మహిళ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన రేస్ బైక్
దవఖానలో చికిత్స పొందుతున్న పద్మజ
తెలంగాణ అక్షరం- కరీంనగర్
సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేతల ర్యాలీలో కరీంనగర్ కోతి రాంపూర్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు బుల్లెట్ వాహనంతో ర్యాలీలో బీభత్సం సృష్టించాడు. బుల్లెట్ బైకును రేస్ చేస్తూ జనం పైకి దూసుకెళ్లాడు.ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పద్మజ అనే మహిళా కానిస్టేబుల్ ను ఢీ కొనగా కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో పాటు ఆమె కాలు విరిగింది.దీంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్ ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ పద్మజను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలని మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పరామర్శించారు.