కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : శ్రీరామనవమి వసంతోత్సవాలు భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు, భక్తుల నివాసాల్లో ఎదురుకోలు వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మానికి ప్రతీకని, చక్కటి పరిపాలనకు నాంది అని స్వామి మరియ స్వామివారి పూజా కార్యక్రమాలు చేసిన గాని, చూసినా గాని, విన్నా గానీ, ప్రచారం చేసినా గాని అన్ని రంగాలలో విజయం సాధ్యమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. స్వామివారి పూజా కార్యక్రమాలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి అన్నారు. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి ఎదుర్కోలు మహోత్సవాన్ని శోభయమానంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రృత్తంగా నిర్వహితున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

అట్టహాసంగా ఎదుర్కోళ్ల పూజలు
Please follow and like us: