వీణ వంక : శ్రీ రాములపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుర్మిండ్ల రాజయ్య (78) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం. మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల రాజయ్య 1990-95లో సర్పంచ్ గా గ్రామ ప్రజలకు సేవలందించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రాజయ్య గురువారం ఆరోగ్యం విషమించి మృతి చెందారు. రాజయ్య మృతిపట్ల గ్రామ ప్రజలు, మండల ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
Please follow and like us: