- విజేతలకు బహుమతులు అందజేత
తెలంగాణఅక్షరం-కరీంనగర్
కరీంనగర్ లోని జ్యోతి నగర్ జీనియస్ చెస్ అకాడమీ లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ మరియు అండర్ 15 విభాగంలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. దాదాపు 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ రమణ మూర్తి మాట్లాడుతూ చదరంగంతో మేధాశక్తి ఏకాగ్రత పెరుగుతుందన్నారు. జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య మాట్లాడుతూ చదరంగం క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే అందుకే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని, పాల్గొన్న గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు మెమొంటోలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వెంకట్ ,జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్, సృజన్ కుమార్, తాటిపల్లి సతీష్ బాబు, చీఫ్ ఆర్బిటర్ అరుణ్, ఆర్బిటర్స్ రేవిక్ , నితిన్ , ప్రభుచంద్ర వరుణ్ ,అభిరామ్ , శ్రీ నిజ , స్వాతి, చదరంగం క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.