అపూర్వ కలయిక… భావోద్వేగాల మధ్య పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తెలంగాణ అక్షరం – హుజురాబాద్:

21 ఏళ్ల క్రితం విడిపోయిన మిత్రులు ఒకసారిగా అంతా ఒకే వేదికపై కలవడంతో వారి భావోద్వేగాలకు అంతులేకుండా పోయింది. హుజురాబాద్ పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో కాకతీయ పాఠశాలలో 2003-04 లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ ఆదివారం వేడుకలు కలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూస్తూ ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

ఈ సమ్మేళనంలో విద్యార్థులకు పాఠాలు నేర్పిన గురువులు సైతం కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సుమారుగా 21 సంవత్సరాల తర్వాత ఒకరినొకరిని కలుసుకొని వారి తీపి గుర్తులతో కాలక్షేపం చేస్తూఆనందంగా గడిపారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉపాధ్యాయులు రాజయ్య ప్రతాపరెడ్డి, వేణుగోపాల్, సదిరెడ్డి, అజ్మత్ అలీ, పున్నం చందర్ లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *