Monthly Archives: May 2025

జమ్మికుంట పట్టణ సీఐని కలిసిన కరీంనగర్‌ జిల్లా సంఘం కమిటీ

తెలంగాణఅక్షరం-జమ్మికుంట ఇటీవల పోలీస్‌ శాఖలో బదిలీలల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతన సీఐగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించగా కరీంనగర్‌ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగరతో పాటు పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతలో పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు కుర్మిండ్ల అశోక్‌ కుమార్‌ సగర, బొడిపెల్లి సదానందం సగర తదితరులు పాల్గొన్నారు.

Read More »

నీరుగారనున్న లక్ష్యం… ”దూరం” కానున్న అంగన్వాడీ సేవలు!

కేంద్రాల తరలింపుపై అధికార యంత్రాంగం చర్యలు గగనకుసుమంగా అందుబాటులో ప్రభుత్వ భవనాలు లబ్ధిదారులకు సేవలు అందటంపై అనుమానాలు గర్భిణీలు, బాలింతలు పోషకాహారానికి దూరమయ్యే అవకాశాలు ఖర్చుల తగ్గింపుకోసం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపాటు తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నీరుగారనున్నదా.. అంటే అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి వాటిని ప్రభుత్వ భవనాల్లోకి మార్చటం పేర ఇతర ప్రాంతాలకు తరలించటమే ఇందుకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులు, మహిళలు, …

Read More »

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి

తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(FAC)గా బాధ్యతలు స్వీకరించిన వీ గంగాధర్ ను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో విశిష్ట అనుభవం కలిగిన విద్యావేత్త, విద్యా రంగానికి ప్రశంసనీయమైన సేవలను అందించి ఇంటర్మీడియట్ విద్యా చరిత్రలో ఎన్నో చారిత్రాత్మక విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడే పలు కార్యక్రమాలకు చేయూతనిస్తామని, బోర్డు నియమ నిబంధనలను చక్కగా అమలుపరచి కరీంనగర్ జిల్లా ఖ్యాతిని రెట్టింపు …

Read More »

CBSE ఫలితాలలో ఏకశిల విద్యాసంస్థల విజయకేతనం

తెలంగాణఅక్షరం-హన్మకొండ ప్రతీ పరీక్షా ఫలితాలల్లో ఏకశిల విద్యార్థుల ప్రభంజనం తప్పనిసరిగా ఉంటుందని ఆ విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం ప్రకటించిన సీబీఎస్ఈ ఫలితాలలో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. కాగా మంగళవారం సీబీఎస్ఈ ఫలితాలల్లో ఉత్తమ మార్కులు సాధించినందుకు విద్యార్థులను ఆయన అభినందించారు.  ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఇంటర్, టెన్త్, నేడు సీబీఎస్ఈ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించి మా ఏకశిలా విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయని తెలిపారు. …

Read More »

జిల్లా సమగ్రాభివృద్ధికోసం సీపీఐ రాజీలేని పోరాటం

హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి హసన్ పర్తి : జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని, హసన్ పర్తి మండల కేంద్రంలో ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే సిపిఐ జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి పిలుపునిచ్చారు. సోమవారం హాసన్ పర్తి మండలకేంద్రంలో నిర్వహించినవిలేకరుల సమావేశంలో సిపిఐ హనుమకొండ జిల్లా 2వ మహాసభల వాల్ పోస్టర్లను సిపిఐ నాయకులతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాహాజరైన జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ …

Read More »

ఆకట్టుకున్న ఉమ్మడి జిల్లా చదరంగం పోటీలు

విజేతలకు బహుమతులు అందజేత తెలంగాణఅక్షరం-కరీంనగర్ కరీంనగర్ లోని జ్యోతి నగర్ జీనియస్ చెస్ అకాడమీ లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ మరియు అండర్ 15 విభాగంలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. దాదాపు 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ రమణ మూర్తి మాట్లాడుతూ చదరంగంతో మేధాశక్తి ఏకాగ్రత పెరుగుతుందన్నారు. జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య మాట్లాడుతూ …

Read More »

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్లాట్ బుకింగ్‌ విధానం ప్రారంభం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ బీ ప్రవీణ్‌కుమార్‌ పెద్దపల్లి, మే12: పెద్దపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో ఆస్తులు/ప్లాట్స్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోనుటకు స్లాట్‌ బుకింగ్‌ విధానం ప్రవేశ పెట్టినట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ బీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. కార్యాలయంలో స్లాట్‌ బుకింగ్‌ విధానం, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని ఆస్తులు/ ప్లాట్స్​‍ను ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయటకు రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ చర్యలు చేపట్టనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 …

Read More »

ఎప్‌సెట్‌ -2025లో శ్రీ చైతన్య ఉత్తమ ప్రతిభ

తెలంగాణ అక్షరం-కరీంనగర్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభచూపినట్లు విద్యాసంస్థల చైర్మన్‌ ముద్దసాని రమేశ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను ఆయన అభినందించారు. గోకులకొండ వైష్ణవి 810 ర్యాంకు, బీ మనోఘ్న 968, బీ సాత్విక్‌ 1142, పీ స్ఫూర్తిశ్రీ 1527, బీ శ్రావణి 1803, పీ బ్లెసీ సుసన్‌ 2106, పీ చందన 2165, పీ భరత్‌ రెడ్డి 2815, పీ అజితేష్‌ 3016, కే అనూహ్య 3503, …

Read More »

ఎప్‌సెట్‌ -2025లో ట్రినిటీ విద్యార్థుల విజయభేరి

తెలంగాణ అక్షరం-కరీంనగర్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్‌ దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోగల కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. తమ విద్యా సంస్థల్లోని విద్యార్థులు 405, 430, 560, 697, 730, 760, 791, 859, 934,1104, 1166, 1546, 1619, 1795, 1950 ర్యాంకులతో పాటు మొత్తం 89 మందికి పైగా విద్యార్థులు 10 వేలలోపు ర్యాంకులు సాధించారని చెప్పారు. ట్రినిటీ …

Read More »

ఎప్‌సెట్‌ -2025లో అల్ఫోర్స్‌ ప్రభంజనం

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అభినందించిన చైర్మన్‌ వీ నరేందర్‌రెడ్డి తెలంగాణ అక్షరం-కరీంనగర్‌ ఎప్‌సెట్‌ -2025 ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోగల టైనిటాట్స్‌ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. కళాశాలకు చెందిన బీ వర్షిత్‌ 203, అదిబా ఫిర్థోజ్‌ 206, ఎం ప్రణీత్‌ 250, కే మనోజ్‌కుమార్‌ 286, బీ శ్రీనిత్య 296, జీ కౌషల్‌ ప్రియ 339, …

Read More »