తెలంగాణ అక్షరం-వీణవంక
మండలంలోని మామిడాల పల్లి గ్రామానికి చెందిన కనకం వెంకటస్వామిని చల్లూరు గ్రామానికి చెందిన నల్లవెల్లి తిరుపతి కులం పేరుతో దూషించగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. కనకం వెంకటస్వామి తన భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టుతుండగా తిరుపతి పనులు ఆపాలని కులం పేరుతో దూషించారు. కాగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Please follow and like us: