2000 నోటుకు నేడే ఆఖరి చాన్స్

గడువు పెంచేనా..
తెలంగాణ అక్షరం-హైదరాబాద్ :

నేటితో రూ.2,000 నోట్ల మార్పిడి గడువు తీరనుంది. రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ లేదా మార్పిడి చేసుకోవాల్సిందిగా సూచించింది. ఇందుకోసం సెప్టెంబరు 30ని చివరి తేదీగా ప్రకటించింది. ఈ వ్యవధిని అక్టోబరు 31 వరకూ పొడిగించే అవకాశాలున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)లోని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని వెల్లడిస్తున్నాయి. ఈ నెల 1న ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో 93 శాతం రూ.2,000 నోట్లు మార్కెట్లో నుంచి వెనక్కి వచ్చాయని తెలిపింది. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్లని పేర్కొంది. ఇంకా రూ.24,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వెనక్కి రావాల్సి ఉందని తెలిపింది. వచ్చిన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగతా 13 శాతం వరకూ మార్పిడి చేసుకున్నట్లు పేర్కొంది.

ఆర్‌బీఐ విధించిన గడువు తీరనున్న నేపథ్యంలో గడువు పెంచుతుందా? లేదా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. కొన్ని బ్యాంకుల్లోకి రూ.2,000 నోట్లు రావడం పూర్తిగా ఆగిపోయినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు 1 నాటికి రూ.24,000 కోట్ల మేరకు ఉన్నప్పటికీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని నోట్లు వెనక్కి వచ్చాయన్న విషయంపై ఆర్‌బీఐ ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో స్వల్ప మొత్తంలో మాత్రమే నోట్లు మార్కెట్లో ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గడువు పెంపుపై చివరి రోజైన నేడు ఆర్‌బీఐ నుంచి స్పష్టత వస్తుందా అనేది చూడాలని అంటున్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *