సీఎం దృష్టికి జర్నలిస్టుల ప్రధాన సమస్యలు

సానుకూలంగా స్పందించిన రేవంత్

ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం

తెలంగాణ అక్షరం-హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ.రేవంత్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం సచివాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఐజేయూ, టీయుడబ్ల్యుజె నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన ప్రతినిధి బృందంలో ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కే.రాంనారాయణ, యూనియన్ నాయకులు కె.రాములు, శిగా శంకర్ గౌడ్ లు ఉన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *